Wed May 21 2025 02:05:27 GMT+0000 (Coordinated Universal Time)
Operation Sindoor : పాక్ ఇరవై నాలుగు చోట్ల భారత్ లో దాడులకు దిగింది
పాకిస్తాన్ ఇరవై నాలుగు చోట్ల భారత్ లో దాడులకు దిగింది విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు

పాకిస్తాన్ ఇరవై నాలుగు చోట్ల భారత్ లో దాడులకు దిగింది విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ నిన్న, ఈరోజు జరిగిన ఘటనలపై దేశ ప్రజలకు వివరించారు. ప్రతిదాడుల్లో భాగంగా బాలిస్టిక్ క్షిపణులను వాడుతున్నామని తెలిపారు. పశ్చిమ సరిహద్దుల్లో పాక్ దాడులకు దిగుతుందని చెప్పారు. పంజాబ్ లోని పలు ప్రాంతాల్లోని ఎయిర్ బేస్ లను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతుందని చెప్పారు. పాకిస్తాన్, భారత్ సరిహద్దుల వెంట భారీగా కాల్పులకు పాల్పడుతుందని చెప్పారు. ఈరోజు ఉదయం కూడా పాక్ దాడులకు దిగిందని తెలిపారు. పాక్ ఫైటర్ జెట్లతో దాడులకు ప్రయత్నించిందని చెప్పారు.
తప్పుడు ప్రచారం...
ఎస్400 ను ధ్వంసం చేశామంటూ పాక్ తప్పుడు ప్రచారానికి దిగిందన్నారు. శ్రీనగర్ లోని స్కూళ్లు, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగిందని వారు వివరించారు. భారత్ ఎయిర్ బేస్ లను కూడా ధ్వంసం చేసిందని పాక్ తప్పుడు ప్రచారం చేసుకుంటుందని తెలిపారు. భారత్ మాత్రం పూర్తిగా సంయమనంతో వ్యవహరిస్తుందన్నారు. పాక్ కు గట్టి జవాబు ఇస్తున్నామని తెలిపారు. పాక్ చేసే తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని అన్నారు. భారత్ ఎయిర్ బేస్ లకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు.
రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందని...
పాక్ రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుందని వారు అన్నారు.శ్రీనగర్, అవంతిపుర, ఉదంపుర్ ఎయిర్ బేస్ లపై దాడులకు పాక్ ప్రయత్నించినా వాటిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టగలిగిందని చెప్పారు. పాకిస్తాన్ ఎయిర్ బేస్ లపైనా భారత్ ప్రతిదాడులు చేసిందని వారు వివరించారు. పాక్ ఫైటర్ జట్లు పలుమార్లు భారత్ భూభాగంపైకి వచ్చాయని అన్నారు. పాకిస్తాన్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను తాము ఖండిస్తున్నామని, పాక్ రెచ్చగొట్టే చర్యలకు దీటైన జవాబు చెబుతామని అన్నారు. ఇరవై నాలుగు చోట్ల పాక్ దాడులకు యత్నించిందని తెలిపారు.
Next Story