Mon Dec 15 2025 23:42:37 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజు భారత్ లో భారీగా కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా 58,097 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

భారత్ లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా 58,097 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 534 మంది మరణించారు. నిన్నటితో పోలిస్తే మరణాల సంఖ్య కూడా బాగా పెరిగింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,50,22, 882 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
యాక్టివ్ కేసులు....
ప్రస్తుతం దేశంలో 2,14,004 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 3,50,18,358 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,82,551 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,47,73,76,774 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
Next Story

