Fri Dec 05 2025 19:16:35 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : తేజస్ లో ప్రయాణం.. అద్భుతం
ప్రధాని నరేంద్రమోదీ తేజస్ లో ప్రయాణం చేశారు. కర్ణాటక పర్యటనలో ఆయన బెంగళూు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్స్ కు వెళ్లారు

ప్రధాని నరేంద్ర మోదీ తేజస్ లో ప్రయాణం చేశారు. కర్ణాటక పర్యటనలో ఆయన బెంగళూరు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్స్ కు వెళ్లారు. అకక స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్ ను పరిశీలించారు. అందులో మోదీ ప్రయాణించారు. తాను తేజస్ లో ప్రయాణించిన ఫొటోలనూ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
ట్వీట్ చేసిన మోదీ...
తాను తేజస్ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశానని, అందులో ప్రయాణం అద్భుతంగా ఉందని మోదీ ట్వీట్ చేశారు. స్వదేశీ సామర్థ్యం పై తన విశ్వాసం మరింత పెరిగిందన్న మోదీ, దేశంలోని శక్తి సామర్థ్యాల పట్ల తనకు గర్వంగా ఉందన్నారు. ఇది మన శాస్త్రవేత్తల కృషికి నిదర్శనమని, అభినందనీయులని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో ఎవరికంటే మనం తక్కువ కాబోమని నిరూపించామన్నారు.
Next Story

