Fri Dec 19 2025 19:11:42 GMT+0000 (Coordinated Universal Time)
పులుల మధ్య మోదీ
మదుమలై, బందీపూర్లో అటవీ ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ గడిపారు. టైగర్ ఫారెస్ట్ లో ఆయన జీపులో తిరిగి పరిశీలించారు

మదుమలై, బందీపూర్లో అటవీ ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ గడిపారు. టైగర్ ఫారెస్ట్ లో ఆయన జీపులో తిరిగి పరిశీలించారు. తెప్పకాడులో ఆయన ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. ఏనుగులతో ప్రధాని నరేంద్ర మోదీ కాసేపు గడిపారు. వాటి సంరక్షణ విషయం అక్కడ వారిని అడిగి తెలుసుకున్నారు. సఫారీ దుస్తులు ధరించి మోదీ అటవీ ప్రాంతంలో పర్యటించారు.
యాభై ఏళ్లు అయిన వేళ...
ప్రాజెక్టు టైగర్ ప్రారంభించి యాభై ఏళ్లు అయిన సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కర్ణాటకలోని బంధీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ను సందర్శించారు. 1973లో పులుల్ని కాపాడేందుకు ఈ సంరక్షణ కేంద్రాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసింది. దీంతో పాటు ఆసియా అడవి ఏనుగులను కూడా మోదీ చూశారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

