Fri Dec 05 2025 14:53:47 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్కు చేరుకున్న జేఎంఎం ఎమ్మెల్యేలు
ఝార్ఖండ్ కు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇక్కడ క్యాంప్ ను ఏర్పాటు చేశారు

ఝార్ఖండ్ కు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు చేరుకున్నారు. నిన్న రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు వచ్చిన జేఎంఎం ఎమ్మెల్యేలు ఒక రిసార్ట్లో బస చేశారు. ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు తీసుకువచ్చినట్లు తెలిసింది
గవర్నర్ ఆహ్వానించకపోవడంతో...
దీంతో జేఎంఎం నేతగా చెంపై సోరెన్ ఎన్నుకున్నారు. ఆయన గవర్నర్ ను కలిసి తనను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా రెండు రోజుల క్రితం కోరారు. అయినా గవర్నర్ నుంచి ఆహ్వానం రాకపోవడంతో ప్రభుత్వాన్ని కూలదేసే అవకాశాలున్నాయని గ్రహించిన జేఎంఎం ఎమ్మెల్యేలను హైదరాబాద్ క్యాంప్నకు తరలించారు.
Next Story

