Operatin Sindoor : పాక్ మత ఘర్షణలను సృష్టించే యత్నంలో దాడులు చేసింది
భారత్ కు చెందిన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడులకు తెగపడిందని పై విదేశాంగ శాఖ,రక్షణ శాఖలు సంయుక్తంగా మీడియా సమావేశంలో తెలిపారు

నిన్న రాత్రి భారత్ కు చెందిన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ దాడులకు తెగపడిందని పై విదేశాంగ శాఖ,రక్షణ శాఖలు సంయుక్తంగా మీడియా సమావేశంలో తెలిపారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ నిన్న, ఈరోజు జరిగిన ఘటనలపై దేశ ప్రజలకు వివరించారు. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను సమర్థవంతంగా కూల్చివేశామని చెప్పారు. నాలుగు ఎయిర్ పోర్టులు లక్ష్యంగా పాక్ దాడులకు యత్నించిందని తెలిపారు. భారత్ గగనతలంలోకి పాక్ డ్రోన్లు, క్షిపణులు, యుద్ధవిమానాలు వచ్చాయని వివరించారు. భారత మిలటరీ స్థావరాలను పాక్ లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగిందని చెప్పారు. పాక్ ఉపయోగించిన డ్రోన్లు టర్కీవి చెందినవిగా ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా గుర్తించామని వారు తెలిపారు.భటిండా, ఉధంపూర్ ఎయిర్ పోర్టులు లక్ష్యంగా చేసుకుని దాడులకు పాకిస్తాన్ ప్రయత్నించిందని చెప్పారు.