Wed Jan 28 2026 06:13:14 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ఛార్టెడ్ ఫ్లైట్ కూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ మరణించారు. ఆయనతో పాటు భద్రతా సిబ్బంది మరో నలుగురు, పైలట్ తో సహా మరణించారు. బారామతిలో సభకు హాజరయ్యేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బారామతిలో ఈ విమానం ల్యాండ్ అవుతుండగా క్రాష్ ల్యాండింగ్ అయిందని తెలిసింది.
బారామతికి వెళుతుండగా...
నిన్న మంత్రివర్గ సమావేశంలో పాల్గొనేందుకు ముంబయి వచ్చిన అజిత్ పవర్ నేడు బారామతికి వెళ్లాల్సి ఉంది. అజిత్ పవార్ తో పాటు ఆయన భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయని తొలుత వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా విమాన ప్రమాదంలో అజిత్ పవర్ తో పాటు ఆరుగురు మరణించారని ప్రకటించారు. అయితే విమానం క్రాష్ అయినతీరును చూసి జీవించడం కష్టమేనని అనుకున్నారు. అనుకున్న విధంగానే అజిత్ పవార్ తో పాటు ఆరుగురు మరణించినట్లు డీజీసీఏ ప్రకటించింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Next Story

