Fri Dec 05 2025 16:02:35 GMT+0000 (Coordinated Universal Time)
షిండేకు సుప్రీంలో ఊరట
సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకు ఊరట లభించింది.

సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకు ఊరట లభించింది. 16 మంది శివసేన ఎమ్యెల్యేల అనర్హత పిటీషన్ పై సుప్రీంకోర్టు అత్యవసర విచారణకు నిరాకరించింది. ఈ పిటీషన్ ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని, తర్వాత విచారణ చేపడతామని సుప్రీకోర్టు తెలిపింది.
అనర్హత ఎమ్మెల్యేలపై...
డిప్యూటీ స్పీకర్ అనర్హత ఎందుకు వేయకూడదంటూ శివసేన రెబల్ ఎమ్మెల్యేలు 16 మంది పై ఆ పార్టీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరింది. అయితే ఇంత అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని కోరుతూ పిటీషన్ ను వాయిదా వేసింది.
Next Story

