Tue Jan 20 2026 10:16:27 GMT+0000 (Coordinated Universal Time)
Maha kumbha Mela : 16వ రోజుకు మహాకుంభమేళా.. రేపు కిక్కిరిసిపోనున్న ఘాట్లు
మహా కుంభమేళా నేటికి పదహారో రోజుకు చేరుకుంది. ఈరోజు, రేపు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు

మహా కుంభమేళా నేటికి పదహారో రోజుకు చేరుకుంది. ఈరోజు, రేపు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. రేపు మౌనిఅమావాస్య కావడంతో ఎక్కువ మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న ఈ కుంభమేళాకు ఇప్పటికే కోట్లాది మంది భక్తులు తరలి వచ్చారు.
మౌని అమావాస్యకావడంతో...
ఈరోజు, రేపు ఇంకా భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించే అవకాశముండటంతో పెద్దయెత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.. స్నానఘట్టాల వ్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భోజనం, వసతి, మంచినీరు వంటి విషయాల్లో ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. లబ్దిదారులకు కేవలం ప్రభుత్వ స్థలాల్లో మాత్రమే ఇంటి స్థలాలను పంపిణీ చేయాలని
Next Story

