Fri Dec 05 2025 14:15:08 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి కేదార్ నాథ్ యాత్ర
నేటి నుంచి కేదార్ నాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. దీంతో అధిక సంఖ్యలో భక్తులు కేదార్ నాథ్ కు తరలి రానున్నారు.

నేటి నుంచి కేదార్ నాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. దీంతో అధిక సంఖ్యలో భక్తులు కేదార్ నాథ్ కు తరలి రానున్నారు. మే 2వ తేదీన ఈ ఆలయం తెరుస్తామని ముందుగానే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించిన మేరకే ఈరోజు కేదార్ నాధ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్హ్వాల్ హిమాలయాలలో ఈ ఆలయం కొలువై ఉంది.
శీతాకాలంలోనే...
ప్రతి ఏడాది శీతాకాలంలో ఈ ఆలయాన్ని మూసివేస్తారు. భారీగా మంచుకురుస్తుండటంతో అక్కడకు ఎవరూ వెళ్లలేని పరిస్థితి. చార్ ధామ్ యాత్రలో భాగంగా వేసవిలోనే ఈ ఆలయం తెరుచుకుంటుంది. శివుడు మంచు తో ఉన్న ఈ ఆలయాన్ని చూసేందుకు వేలాది మందిభక్తులు వస్తుంటారు. పన్నెండు జ్యోతిర్లింగాల్లో కేదార్ నాథ్ ఆలయం ఒకటి. పహల్గాం దాడితో భారత సైన్యం అప్రమత్తమై భక్తులకు రక్షణ కల్పిస్తుంది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారినే ఈ ఆలయ దర్శనానికి అనుమతిస్తారు.
Next Story

