Thu Mar 19 2026 13:14:10 GMT+0530 (India Standard Time)
కశ్మీర్ పండిట్లు సంచలన నిర్ణయం
కశ్మీర్ పండిట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కశ్మీర్ ను విడిచి జమ్మూ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

కశ్మీర్ పండిట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కశ్మీర్ ను విడిచి జమ్మూ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కశ్మీర్ నుంచి వదలి వెళ్లిపోవాలని తమ నిర్ణయం కఠినమైనదనా తప్పదని వారు చెబుతున్నారు. భవిష్యత్ లో ఇక కశ్మీర్ కు వచ్చే ప్రసక్తి లేదని పండిట్లు స్పష్టం చేేస్తున్నారు.
జమ్మూకు వలస.....
కశ్మీర్ లో వరసగా ఉగ్రవాదులు ఇద్దరు పండిట్లను హతమార్చిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు తమను టార్గెట్ గా చేసుకున్నారని, ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమయిందని వారు ఆరోపించారు. తాము భవిష్యత్ లో కశ్మీర్ లో అడుగుపెట్టబోమని వారు స్పష్టీకరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని ఉగ్రవాదుల నుంచి పౌరులను కాపాడాలని కశ్మీర్ పండిట్లు కోరుతున్నారు.
Next Story

