Thu May 02 2024 21:39:45 GMT+0000 (Coordinated Universal Time)
జేపీ నడ్డా పదవీకాలం పొడిగింపు
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని మరికొంత కాలం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని మరికొంత కాలం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడిగా 2024 జూన్ నెలవరకూ పదవిలో ఉంటారు. అనేక రాష్ట్రాలకు చెందిన పార్టీ అధ్యక్షుల పదవీకాలాన్ని కూడా పొడిగించనున్నారు. ఇందులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఒకరు. ఈ నాలుగు వందల రోజులు కీలకమని ప్రధాని మోదీ తన ప్రసంగంలో చెప్పారు. ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
తొమ్మిది రాష్ట్రాల ఎన్నికల్లో...
రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అనేక అంశాలపై చర్చించారు. ఈ ఏడాది జరగనున్న తొమ్మిది రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తిరిగి అధికారం దక్కించుకోవడం, లేని చోట పవర్ లోకి రావడంపై నేతలు ప్రధానంగా చర్చించారని తెలిసింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర నేతలకు సంబంధించి దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. తొమ్మిది రాష్ట్రాల్లో గెలుపుతో 2024 లోక్ సభ ఎన్నికల్లో మరోసారి గెలుపును సుస్థిరం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలపైనే ప్రధానంగా చర్చించారు.
Next Story