Fri May 23 2025 02:46:30 GMT+0000 (Coordinated Universal Time)
ఇకపై టోల్ ఫీజు వసూలు కొత్త విధానం.. ఫాస్టాగ్ లేకపోయినా?
టోల్ ఫీజు వసూలులో మే 1వ తేదీ నుంచి కొత్త విధానాన్ని అమలులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది

టోల్ ఫీజు వసూలులో మే 1వ తేదీ నుంచి కొత్త విధానాన్ని అమలులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఫాస్టాగ్ లేకపోయినా ఇక మే ఒకటో తేదీ నుంచి టోల్ గేట్ ఫీజు వసూలు విషయంలో కొత్త విధానాన్ని ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. మే ఒకటో తేదీ నుంచి జీపీఎస్ ఆధారంగా టోల్ సిస్టమ్ ను ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం అంతా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఫాస్టాగ్ లేకపోయినా జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి టోల్ ఫీజు వాహన యజమాని నుంచి వసూలు చేస్తారు.
జీపీఎస్ ద్వారా...
ఇకపై వాహనాల నుంచి టోల్ ఫీజు ఫాస్టాగ్ ద్వారానే కాకుండా జీపీఎస్ ఆధారంగా కూడా వసూలు చేయనున్నారు. అంటే వాహనం ఎంత దూరం ప్రయాణించిందో దానికి అనుగుణంగా టోల్ చార్జీలు వసూలు చేస్తారు. ఇక టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండకుండా కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోనుంది. మే ఒకటో తేదీ నుంచి ఈ నూతన విధానం అమలులోకి వస్తుంది. ఇందుకోసం వాహనాల్లో జీపీఎస్ ట్రాకింగ్ అవసరం అవుతుంది. ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ చార్జీలు లెక్కిస్తారు. రోడ్లపై ట్రాఫిక్ తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇది దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థను మరింత స్మార్ట్గా, వేగవంతంగా మార్చే కీలక నిర్ణయంగా భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
Next Story