Fri Dec 05 2025 08:13:19 GMT+0000 (Coordinated Universal Time)
Operation Sindhoor : భారత్ ధ్వంసం చేసిన ఉగ్రవాద స్థావరాలివే
భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్థాన్ ఉగ్రవాదుల శిబిరాలపై దాడులకు దిగింది.

భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్థాన్ ఉగ్రవాదుల శిబిరాలపై దాడులకు దిగింది. అయితే మొత్తం తొమ్మిది స్థావరాలను ధ్వంసం చేసినట్లు భారత్ సైన్యం తెలిపింది. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయినట్లు కూడా తెలిసింది. అయితే భారత్ పాకిస్థాన్ లోని పౌరులను లక్ష్యంగా కాకుండా కేవలం ఉగ్రవాదుల స్ధావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడికి దిగింది. భారత్ గడ్డపై నుంచి పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది.
భారత్ ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాలు ఏవంటే?
01. బహవల్పూర్లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం
02. లష్కరే క్యాంప్
03. గుల్పూర్
04. సవాయ్ లష్కరే క్యాంప్
05. జేఎం లాంచ్ప్యాడ్ బిలాల్ క్యాంప్
06. జేఎం లాంచ్ప్యాడ్ బిలాల్ క్యాంప్
07. బర్నాలా క్యాంప్
08. సర్జల్ క్యాంప్
09. మెహమూనా క్యాంప్
Next Story

