LPG Gas : భారత ప్రజలకు గుడ్ న్యూస్.. గ్యాస్ కొరత ఇక లేనట్లే
భారత ప్రజలకు గుడ్ న్యూస్ అందింది. హార్ముజ్ ద్వారా నౌకలు సురక్షితంగా భారత్ కు చేరుకుంటున్నాయి

భారత ప్రజలకు గుడ్ న్యూస్ అందింది. హార్ముజ్ ద్వారా నౌకలు సురక్షితంగా భారత్ కు చేరుకుంటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఇరాన్ యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ కొరతకు చెక్ పడనుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం, చమురు సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి. హార్ముజ్ జలసంధిలో ఎదురైన అంతర్జాతీయ అడ్డంకులను అధిగమించి, సుమారు 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ లోడ్తో వస్తున్న 'శివాలిక్' నౌక ఈ రోజు తెల్లవారుజామున గుజరాత్లోని ముంద్రా పోర్టుకు చేరుకుంది. దీనికి తోడు, అదే స్థాయిలో నలభై ఆరు వేల మెట్రిక్ టన్నుల గ్యాస్తో వస్తున్న మరో భారీ నౌక 'నందా దేవి'కి ఇండియన్ నేవీ పటిష్టమైన ఎస్కార్ట్ను కల్పిస్తోంది. యుద్ధ నౌకల రక్షణలో వస్తున్న ఈ నౌక కూడా అతి త్వరలోనే భారత తీరానికి చేరుకోనుంది. ఈ రెండు ప్రధాన నౌకల రాకతో దేశీయంగా గ్యాస్ సరఫరాలో ఉన్న ఇబ్బందులు చాలా వరకు తీరనున్నాయని భారత ప్రభుత్వం తెలిపింది.

