Sat May 24 2025 13:57:37 GMT+0000 (Coordinated Universal Time)
Operation Sindoor : దాడికి ప్రతి దాడి.. పాక్ పై విరుచుకుపడిన భారత్
పాకిస్తాన్ దాడులకు ప్రతి చర్యకు భారత్ దిగింది

పాక్ దాడులకు ప్రతి చర్యకు భారత్ దిగింది. గురు, శుక్రవారాల్లో వరసగా డ్రోన్లతో భారత్ పై డ్రోన్లతో పాకిస్తాన్ దాడులకు యత్నించడంతో అందుకు ప్రతీకారం తో ఆపరేషన్ సిందూర్ తో మరొకసారి దీటైన జవాబు చెప్పింది. భారత్ పాక్ లోని మూడు ప్రధాన వైమానిక స్ధావరాలపై దాడులు జరిపింది. ఈ దాడుల విషయాన్ని పాక్ ఆర్మీ ధృవీకరించింది. ఆ దేశ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదురి పాక్ పై భారత్ చేసిన దాడులు నిజమేనని చెప్పారు. రావల్పిండిలో ఉన్న పాక్ సైన్యానికి చెందిన చ్లాలలోని నూర్ ఖాన్, చక్వాల్ లోని మురీద్, జాంగ్ జిల్లా షోర్కోల్ లో ఉన్న రఫీ వైమానిక స్థావారాల్లో భారత్ విరుచుకుపడింది.
బలమైన పునాది అంటూ...
దీంతో పాక్ కు అతి భారీ నష్టం జరిగిందన్న అంచనాలు వినపడుతున్నాయి. పాక్ కూడా భారత్ పై దాడులకు "ఆపరేషన్ బున్యాన్ ఉన్ మర్సూస్" అని పేరుపెట్టింది. అంటే బలమైన పునాది అని అర్థం వచ్చేలా ఆపరేషన్ కు పేరు పెట్టింది. అయితే ఈరోజు ఉదయం పదిగంటలకు భారత సైన్యం మీడియా సమావేశాల్లో మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశముంది. పహాల్గాం లో ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలను తీసుకున్న ఉగ్రవాదుల పీచమణిచివేసేందుకు భారత్ ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించింది.
పహాల్గామ్ పై దాడికి చర్యగానే...
పాక్ లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసింది. హహాల్గామ్ చర్యకు ప్రతి చర్యగానే భారత్ ఈ దాడికి దిగింది. ఈ దాడుల్లో వంద మంది ఉగ్రవాదుల వరకూ హతమయ్యారు. అంతటితో పాక్ ఊరుకుంటే బాగుండేది. కానీ దానికి ప్రతీకారంగా సరిహద్దు రాష్ట్రాల్లో గురు, శుక్రవారాల్లో వందల సంఖ్యలో డ్రోన్లతో దాడికి ప్రయత్నించడంతో ప్రతి దాడి చేయాల్సి వచ్చిందని అంటున్నారు. పాక్ తగ్గకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న హెచ్చరికలు మాజీ సైనిక అధికారులు కూడా చేస్తున్నారు. రాత్రివేళ మాత్రమే పాక్ దాడులకు దిగుతుంది.
Next Story