Fri Dec 05 2025 11:30:21 GMT+0000 (Coordinated Universal Time)
ఆదాయపు పన్ను శాఖ కీలక ప్రకటన
ఆదాయపు పన్ను శాఖ కీలక ప్రకటన చేసింది. ఐటీ రిటర్న్స్ విషయంలో గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది

ఆదాయపు పన్ను శాఖ కీలక ప్రకటన చేసింది. ఐటీ రిటర్న్స్ విషయంలో గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి పన్ను రిటర్న్ దాఖలు గడువు ఈ ఏడాదిజులై 31వ తేదీతో ముగియనుంది. అయితే సెప్టంబరు 15వ తేదీ వరకూ ఐటీ రిటర్న్ దాఖలు చేయవచ్చని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఐటీఆర్ ఫారాలనోటిఫికేషన్ జారీ ఆలస్యం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
గడువు పొడిగింపు...
ఎలాంటి అవాంతరాలు లేకుండా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి సెప్టంబరు పదిహేనో తేదీ వరకూ గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తామని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఐటీ రిటర్న్స్ గడువు పొడిగించడంతో చాలా మందికి కొంత ఊరట దక్కినట్లయింది.
Next Story

