Sat Dec 06 2025 02:11:31 GMT+0000 (Coordinated Universal Time)
యూపీలో కేంద్ర మంత్రి కాన్వాయ్ పై దాడి
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు బీజేపీ, ఎస్పీల మధ్య ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ఇప్పటికి రెండు దశల్లో ఎన్నికలు ముగిశాయి.

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ, సమాజ్ వాదీ పార్టీల మధ్య ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ఇప్పటికి రెండు దశల్లో ఎన్నికలు ముగిశాయి. అయితే ఉద్రిక్తతలు మాత్రం వీడటం లేదు. కేంద్ర మంత్రి బఘేల్ కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఈ దాడిలో బఘేల్ కు ఎటువంటి ప్రమాదం జరగకపోయినా దాడిపై భారతీయ జనతా పార్టీ సీరియస్ అయింది.
ఎస్పీ పనే అంటున్న....
బఘేల్ సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పై పోటీ చేస్తున్నారు. కర్హాల్ స్థానం నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ దాడిని సమాజ్ వాదీ పార్టీ శ్రేణులే చేశాయని బీజేపీ ఆరోపిస్తుంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

