Sat May 24 2025 13:29:21 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కేంద్రం కీలక నిర్ణయం... చార్ ధామ్ యాత్ర రద్దు
భారత్ - పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. . చార్ ధామ్ యాత్ర ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది

భారత్ - పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చార్ ధామ్ యాత్ర ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ చార్ ధామ్ యాత్రను నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల ఉత్తరాఖండ్ లోని దేవాలయాల తలుపులు తెరుచుకున్నాయి.
తదుపరి ఆదేశాలను ...
చార్ ధామ్ యాత్రకోసం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే పాకిస్తాన్ డ్రోన్లతో జరుపుతున్న దాడుల నేపథ్యంలో చార్ ధామ్ యాత్రను కొంతకాలం నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బద్రీనాధ్, కేదార్ నాధ్, గంగోత్రి, యమునోత్రికి వెళ్లే భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ చార్ ధామ్ యాత్ర కొనసాగించవద్దని పేర్కొంది. అక్కడ హెలికాప్టర్ సేవలను కూడా నిలిపివేసింది
Next Story