Tue Jan 20 2026 01:31:18 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్ రైలు.. ఆరుగురికి గాయాలు
జార్ఖండ్ లో హౌరా - సీఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

జార్ఖండ్ లో రైలు పట్టాలు తప్పింది. హౌరా - సీఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చక్రధర్ పుర్ డివిజన్ లో ఘటన జరిగింది. ప్రమాదం జరగడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. మిగిలిన బోగీల నుంచి బయటకు కిందకు దూకేశారు.
సహాయక చర్యలు...
మూడు బోగీలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే సిబ్బంది వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. సాంకేతిక కారణాలా? మరేదైనా? అన్న కోణంలో రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story

