Fri Dec 05 2025 09:14:50 GMT+0000 (Coordinated Universal Time)
ఉత్తర భారతాన్ని వణికిస్తున్న వర్షాలు
ఉత్తర భారత దేశంలో భారీ వర్షాలు పడుతున్నాయి. జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో మెరుపు వరదలతో అనేక మంది గల్లంతయ్యారు

ఉత్తర భారత దేశంలో భారీ వర్షాలు పడుతున్నాయి. జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో మెరుపు వరదలతో అనేక మంది గల్లంతయ్యారు. జమ్మూ - పఠాన్ కోట్ జాతీయ రహదారిపై ఉన్న ముఖ్యమైన వంతెన ఈ వరదలతో దెబ్బతినింది. సహర్ ఖడ్ నది పొంగి ప్రవహించడంతోనే వంతెన కూలిపోయిందని అధికారులు తెలిపారు.
ప్రమాదకరంగా నదులు...
భారీ వర్షాలకు కాల్వలు, నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయని ఎవరూ వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు కోరారు. అయితే ఈ వరదలతో అనేక మంది గల్లంతయ్యారని చెబుతున్నారు. సంఖ్య ఎంత అనేది తేలకపోయినా వందల్లోనే గల్లంతయి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. మరొకవైపు సహాయక బృందాలు నిరంతరం భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలిచి వారిని పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు.
Next Story

