Thu May 22 2025 06:35:46 GMT+0000 (Coordinated Universal Time)
Maharashtra : మహారాష్ట్రలో జీబీఎస్ కలకలం.. వ్యాధి లక్షణాలు ఏంటంటే?
మహారాష్ట్రలో గిలైన్ బారె సిండ్రోమ్ కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే ఒక వ్యక్తి మరణించారు

మహారాష్ట్రలో గిలైన్ బారె సిండ్రోమ్ కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే ఒక వ్యక్తి మరణించారు. జీబీఎస్ బారినపడి అనేక మంది వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఒక్క పూనేలోనే 101 మందికి జీబీఎస్ సోకింది. ఇందులో పదహారు మంది వెంటిలేటర్ల మీద చికిత్స పొందుతున్నారు. మృతుడు కూడా పూనేకు చెందిన వారు. బాక్టీరియా, వైరల్ ఇన్ ఫెక్షన్ కారణంగానే ఈ వ్యాధిసోకుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలున్నాయి.
లక్షణాలివే...
దీని ప్రభావంపై నరాలపై పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన వారికి కండరాలు బలహీనంగా మారతాయి. ఒళ్లంతా తిమ్మిరి ఎక్కుతుంది. అయితే ఈ వ్యాధికి ప్రధాన కారణం కలుషిత నీరు, ఆహారమేనని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధిన పడిన వారిలో డయేరియా, పొత్తుకడుపు నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే బయట నుంచి వచ్చిన వారు కాళ్లు చేతులు శుభ్రపర్చుకోవడం, వేడి చల్లార్చుకున్న నీటిని తాగడం వంటివి చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
Next Story