Fri Dec 05 2025 13:16:41 GMT+0000 (Coordinated Universal Time)
గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త
ఇంధన ధరలు పెరిగినందున, మే 2022లో ప్రభుత్వం PMUY లబ్ధిదారులకు సిలిండర్

మీరు ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకం కింద గ్యాస్ తీసుకుంటున్నారా? అయితే మీకొక గుడ్ న్యూస్. ఈ పథకం కింద గ్యాస్ సిలిండర్లకు రాయితీ గడువును మరో ఏడాది కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద కేంద్ర ప్రభుత్వం 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ గ్యాస్పై రూ.300 రాయితీని అందిస్తోంది. ఈ గడువును మార్చి 31, 2025 వరకు పొడిగించినట్లు కేంద్రం తెలిపింది. ఉజ్వల పథకం కింద కనెక్షన్ ఉచితంగా అందించగా, లబ్ధిదారులు మార్కెట్ ధరకే ఎల్పిజి రీఫిల్లను కొనుగోలు చేయాల్సి వచ్చింది.
ఇంధన ధరలు పెరిగినందున, మే 2022లో ప్రభుత్వం PMUY లబ్ధిదారులకు సిలిండర్కు ₹200 సబ్సిడీని అందించింది. అక్టోబర్ 2023లో 300కి పెంచారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్తో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను సిలిండర్కు ₹200 తగ్గించింది. దీని తర్వాత, LPG సిలిండర్ ధర 903కి చేరింది. ఉజ్వల లబ్ధిదారులకు, సిలిండర్కు 300 సబ్సిడీని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ధర 603గా ఉంటుంది. ఇది నేరుగా కనెక్షన్ హోల్డర్ల బ్యాంక్ ఖాతాలకు వెళుతుంది. PMUY లబ్ధిదారులకు సంవత్సరానికి 12 రీఫిల్ సిలిండర్ రాయితీ కింద ఇస్తున్నారు. PMUY వినియోగదారుల సగటు LPG వినియోగం 2019-20లో 3.01 రీఫిల్స్ నుండి 2021-22లో 3.68కి పెరిగింది. PMUY లబ్ధిదారులందరూ సబ్సిడీ పథకానికి అర్హులు.
Next Story

