Sun Mar 08 2026 09:01:13 GMT+0530 (India Standard Time)
పుల్వామా దాడికి నేటికి నాలుగేళ్లు
నాలుగేళ్ల క్రితం ఈరోజే జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో సైనిక వాహన శ్రేణిపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడికి దిగారు.

నాలుగేళ్ల క్రితం ఇదే రోజు జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో సైనిక వాహన శ్రేణిపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడికి దిగారు. ఆత్మాహుతికి పాల్పడ్డారు. నాటి నుంచి నేటి వరకూ ఫిభ్రవరి 14న బ్లాక్ డేగా పరిగణిస్తారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీు ఫోర్స్ కు చెందిన నలభై మంది సైనికులు మరణించారు. ఆత్మాహుతి దాడి చేయడంతో ఈ దుర్ఘటన జరిగింది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.
నేడు బ్లాక్ డే....
జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారిపై అవంతపురం సమపీంలో 2019 ఫిబ్రవరి 14 సాయంత్రం నాలుగు గంటలకు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. జమ్ము నుంచి సైనికుల వాహనం శ్రీనగర్ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడికి జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు కారణంగా ప్రకటించుకున్నారు. పక్కా వ్యూహంతోనే దాడి చేశారు. ఆత్మాహుతి దాడికి కాశ్మీరీ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ ను జైషే మొహమ్మద్ సంస్థ వినియోగించుకుంది. ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న ఉగ్రవాది కూడా ఈ ఘటనలో హతమయ్యాడు. దేశ వ్యాప్తంగా అమరవీరులకు నేడు నివాళులర్పిస్తున్నారు.
- Tags
- pulwama attack
Next Story

