Sun May 05 2024 04:11:22 GMT+0000 (Coordinated Universal Time)
లాలూపై మళ్లీ కేసు విచారణ
మాజీ కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను మరోసారి సీబీఐ విచారించనుంది
మాజీ కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను మరోసారి సీబీఐ విచారించనుంది. రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలిప్పిస్తానని భూములు తీసుకున్న కేసులో ఆయనను విచారించనుంది. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ ను విచారించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతిచ్చింది.
విచారించేందుకు...
ఈ మేరకు సీబీఐ ఈ కేసు విషయంలో త్వరలో లాలూ ప్రసాద్ యాదవ్ ను ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. కొదరి నుంచి భూములను తీసుకున్నారన్న కేసులో విచారించనుంది. ఈ కేసును తిరిగి విచారించాలని నిర్ణయించింది.
Next Story