సింగపూర్లో స్కూల్లో అగ్నిప్రమాదం – పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన ఘటన కలకలం...
సింగపూర్ స్కూల్లో అగ్నిప్రమాదం… పవన్ కుమారుడు మార్క్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స, పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.

సింగపూర్ లో ఏప్రిల్ 8, 2025న రివర్ వ్యాలీ రోడ్ వద్ద ఉన్న ఒక షాప్హౌస్ లో సంభవించిన తీవ్ర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఒక 10 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురు పెద్దలతో పాటు 15 మంది చిన్నారులు ఉన్నారు. గాయపడిన చిన్నారుల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ (8) కూడా ఉండటం గమనార్హం.
అగ్నిప్రమాదానికి సంబంధించి సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ (SCDF) ఉదయం 9:45కి స్పందించింది. మూడు అంతస్తుల భవనంలో రెండవ, మూడవ అంతస్తులు మంటల్లో పూర్తిగా కాలి పోయాయి. ఈ భవనంలో పలు విద్యా సంస్థలు నిర్వహించబడుతున్నాయి. మూడవ అంతస్తు నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్న విద్యార్థులను కూలీలు మెటల్ స్కాఫోల్డింగ్ సహాయంతో కాపాడారు. అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సహాయ చర్యలు చేపట్టి, మంటలను 30 నిమిషాల్లో ఆర్పారు.
మార్క్ శంకర్ కు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. తోడు పొగ కారణంగా శ్వాస సమస్యలు ఏర్పడాయి. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్క్ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్టు సమాచారం.
ఈ ప్రమాద సమయంలో పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటనలో ఉన్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఆయనను సింగపూర్కి వెళ్లాలని పలువురు విజ్ఞప్తి చేసినా, అరకు సమీపంలోని కురిడి గ్రామాన్ని సందర్శించి ప్రజలతో సమావేశంలో కలవాలని, తను మాట ఇచ్చానని తెలిపారు. “ఆదివాసీ సోదరులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. వారి సమస్యలు వినటానికి ముందుగా కురిడి వెళతాను,” అని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఆయన మంగళవారం మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి సింగపూర్కి బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో నిర్వహించాల్సిన జూపార్క్ సందర్శన, సమీక్ష సమావేశాలు రద్దు చేశారు.
పవన్ కల్యాణ్ తన మూడవ భార్య, రష్యన్ నటి అన్నా లెజ్నేవాతో 2013లో వివాహం చేసుకున్నారు. వీరికి మార్క్ శంకర్ మరియు పోలెనా అంజనా పవనోవా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గల కారణాలపై సింగపూర్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.