Mon Feb 02 2026 03:19:22 GMT+0000 (Coordinated Universal Time)
Loksabha Elections : రేపు ఐదో దశ పోలింగ్.. ఏర్పాట్లు పూర్తి
ఐదో దశ పోలింగ్కు ఎన్నికల కమిషన్ చేసింది. రేపు ఐదో దశ పోలింగ్ జరగనుంది.

ఐదో దశ పోలింగ్కు ఎన్నికల కమిషన్ చేసింది. రేపు ఐదో దశ పోలింగ్ జరగనుంది. ఐదో దశపోలింగ్ లో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 స్థానాలకు పోలింగ్ జరగనునంది. నలభై తొమ్మిది నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం ప్రచారం ముగిసింది. ఉత్తర్ప్రదేశ్ లో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
49 స్థానాలకు...
ఒడిశాలో 5, బీహార్లో 5, జార్ఖండ్లో 3 నియోజకవర్గాలకు రేపు పోలింగ్ జరగనుంది. జమ్ముకశ్మీర్లో ఒకటి, లడక్లో ఒక స్థానానికి రేపు పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్కు కీలక స్థానాలు రాయబరేలీ, అమేథిలో రేపు పోలింగ్ జరగనుంది. రాయబరేలీలో రాహుల్, అమేథిలో కేఎల్ శర్మ పోటీ లో ఉన్నారు. రేపు జరగబోయే ఎన్నికల బరిలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్, స్మృతి ఇరానీ, సాధ్వి నిరంజన్ తదితరులున్నారు.
Next Story

