Tue Mar 24 2026 23:17:29 GMT+0530 (India Standard Time)
అసోంలో రైలు ఢీకొని ఎనిమిది ఏనుగులు మృతి
అసోంలోని హొజాయ్ లో ఎనిమిది ఏనుగులు మరణించాయి. రైలు ఢీకొని ఇవి మరణించాయి

అసోంలోని హొజాయ్ లో ఎనిమిది ఏనుగులు మరణించాయి. రైలు ఢీకొని ఇవి మరణించాయి. అసోంలో ఈ ఘటన విషాదకరంగా మారింది. ట్రాక్ ను దాటుతుండగా రాజధాని ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ ఏనుగుల గుంపును ఢీకొట్టింది. దీంతో ఎనిమిది ఏనుగులు మరణించాయి. ఈ ఘటనలో రాజధాని ఎక్స్ ప్రెస్ కు చెందిన ఐదు బోగీలు పట్టాలు తప్పాయి.
ట్రాక్ దాటుతుండగా...
ఈ ఘటనతో రైల్వే శాఖ అప్రమత్తమయింది. అసోంలో అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఏనుగుల గుంపు అక్కడకు చేరుకుని ట్రాక్ దాటే సమయంలోనే ఈఘటన జరిగిందని తెలిసింది. దీంతో రాజధాని ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో ఆ ప్రాంతంలో చాలా సేపు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
Next Story

