Sun Mar 15 2026 06:29:25 GMT+0530 (India Standard Time)
Earth Quake : భారత్ లో భూకంపం
భారత్ లో భూకంపం సంభవించింది. నేపాల్ టిబెట్ మధ్య భూకంపం కేంద్రం ఉన్నట్లు గుర్తించారు

భారత్ లో భూకంపం సంభవించింది. నేపాల్ టిబెట్ మధ్య భూకంపం కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. నేపాల్ నుంచి 93 కిలోమీటర్ల దూరంలో లబుచి వద్ద భూకంపం కేంద్రం ఉన్నట్లు కనుగొన్నారు. ఢిల్లీ లోని పలు ప్రాంతాలు కూడా కంపించాయి. దీంతో పాటు బీహార్, బెంగాల్ రాష్ట్రంలోనూ భూ ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు.
రిక్టర్ స్కేల్ పై...
రిక్టర్ స్కేల్ పై 71. తీవ్రతగా నమోదయిందని అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం భూకంపం సంభవించిందని నేపాల్ - టిబెట్ సరిహద్దు లబుచేకకు 93 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రాన్ని ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆస్తి, ప్రాణ నష్టం పై ఎలాంటి సమాచారం అందలేదు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది. అయితే భూమి కంపించడంతో అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ
Next Story

