Sat Dec 06 2025 09:44:57 GMT+0000 (Coordinated Universal Time)
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.6 తీవ్రతగా నమోదయిందని అధికారులు వెల్లడించారు

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.6 తీవ్రతగా నమోదయిందని అధికారులు వెల్లడించారు. తెల్లవారు జామున భూకంపం రావడంతో ప్రజలు ఇళ్లలో నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ప్రాణ, ఆస్తి నష్టం...
అయితే ఈ భూకంపం తీవ్రతకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. సాధారణంగానే భూమి కంపించిందని అధికారులు చెబుతున్నా ప్రజలు మాత్రం బితుబితుకు మంటూనే గడుపుతున్నారు.
Next Story

