Mon Feb 02 2026 00:43:39 GMT+0000 (Coordinated Universal Time)
Karnataka : కర్ణాటకలో లోక్సభ ఎన్నికల వేళ....కోట్ల విలువైన మద్యం స్వాధీనం
లోక్సభ ఎన్నికల వేళ కర్ణాటకలో భారీగా మద్యం నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

లోక్సభ ఎన్నికల వేళ కర్ణాటకలో భారీగా మద్యం నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 98.52 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఎన్నికల వేళ పంపిణీకి సిద్ధంగా ఉందన్న సమాచారంతో ఇంత విలువైన భారీ అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ పోలీసులు. ధీలోక్ సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో ఇంత పెద్ద స్థాయిలో మద్యం పట్టుబడం సంచలనంగా మారింది.
3.52 కోట్ల నగదు...
మైసూర్ లోని చామరాజ నగర్ నియోజక వర్గంలో రూ 98.52 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. పట్టుబడిన మధ్యంలో 1.22 లీటర్ల బీర్ వుందని తెలిపారు, అలాగే అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఐటిఎస్ఎస్టీ బృందం రూ. 3.53 కోట్ల రూపాయలను కూడా స్వాధీనం చేసుకుంది.
Next Story

