Thu Jan 29 2026 00:07:49 GMT+0000 (Coordinated Universal Time)
Delhi Liquor Scam : డిసెంబరు నాలుగొ తేదీకి విచారణ వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ వాయిదా పడింది. అక్రమంగా అరెస్ట్ చేశారంటూ అభిషేక్ బోయినపల్లి వేసిన పిటీషన్ పై విచారణ జరిగింది

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విచారణ వాయిదా పడింది. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ అభిషేక్ బోయినపల్లి వేసిన పిటీషన్ పై విచారణ జరిగింది. సుప్రీకోర్టులో దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం డిసెంబరు 4వ తేదీకి వాయిదా వేసింది. ఐదు రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశాలు జారీ చేసింది.
తనది అక్రమ అరెస్ట్ అంటూ...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అభిషేక్ బోయినపల్లి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. కోట్ల రూపాయలు చేతులు మారడంలోనూ ఆయన పాత్ర ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు విచారణను వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
Next Story

