Sat Apr 27 2024 16:18:02 GMT+0000 (Coordinated Universal Time)
Kejrival : మరోసారి కేజ్రీవాల్ డుమ్మా.. నేను రానంటూ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణకు హాజరు కాలేదు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణకు హాజరు కాలేదు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీలాండరింగ్ కేసులో తొమ్మిది సార్లు నోటీసులు అందుకున్న అరవింద్ కేజ్రీవాల్ విచారణకు మాత్రం హాజరు కాలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల 21వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.
జల్ బోర్డు స్కామ్ కేసులో...
మరోవైపు ఢిల్లీ జల్ బోర్డు స్కామ్ మనీలాండరింగ్ కేసులో నేడు విచారణకు రావాలని కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు నోటీసులు పంపారు. అయినా ఆయన సానుకూలంగా స్పందించలేదు. తనకు కోర్టులో బెయిల్ ఇచ్చిందని, మరోసారి తనకు ఎందుకు సమన్లు పంపారో తెలియదని ఆమ్ ఆద్మీపార్టీ నేతలు చెబుతున్నారు.
Next Story