Tue Jan 20 2026 15:07:42 GMT+0000 (Coordinated Universal Time)
కేజ్రీవాల్ కు దక్కని రిలీఫ్
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు హైకోర్టులో ఊరట లభించలేదు

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు హైకోర్టులో ఊరట లభించలేదు. ఏప్రిల్ 2వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేశారు. దీంతో ఈడీ కేసు నుంచి తనకు రిలీఫ్ దొరుకుతుందని భావించిన కేజ్రీవాల్ కు నిరాశ ఎదురయింది.
ఏప్రిల్ 3వ తేదీన...
ఆయనను ఈ కేసులో విచారణ చేస్తున్నారు. ఆరు రోజుల కస్టడీకి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ ను ఈడీ అప్పగించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల అక్రమంగా అరెస్ట్ చేశారని, తనను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయంపై కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో కేజ్రీవాల్ ఉన్నారు.
Next Story

