Sat Jul 27 2024 05:58:49 GMT+0000 (Coordinated Universal Time)
కోవిడ్ కు ట్యబ్లెట్... 63 రూపాయలు మాత్రమే
కోవిడ్ కు కొత్తగా మాత్ర వచ్చేసింది. ఈ ట్యాబ్లెట్ ను ప్రముఖ ఔషధ సంస్థ ఆప్టిమన్ ఫార్మా రూపొందించింది
![covid, tablet, optimum pharma, dgci, mulnupiravar covid, tablet, optimum pharma, dgci, mulnupiravar](https://www.telugupost.com/h-upload/2021/12/31/1302705-covid-tablet-optimum-pharma-dgci-mulnupiravar.webp)
కోవిడ్ భయంతో ప్రజలు వణికిపోతున్నారు. కాస్త జలుబు, దగ్గు వస్తే వెంటనే పరీక్షల కోసం పరుగులు తీస్తున్నారు. పరీక్ష ఫలితం వచ్చిన దాకా టెన్షన్ తప్పడం లేదు. కోవిడ్ వ్యాక్సినేషన్ ను రెండు డోసులు వేసుకున్న వారిని కూడా ఈ భయం వీడటం లేదు. అయితే కోవిడ్ కు కొత్తగా మాత్ర వచ్చేసింది. ఈ ట్యాబ్లెట్ ను ప్రముఖ ఔషధ సంస్థ ఆప్టిమన్ ఫార్మా రూపొందించింది. దీనిని మూడు దశల్లో పరీక్ష చేశారు.
అన్నీ అనుమతులు....
ఈ ట్యాబ్లెట్ కు డీసీజీఐ అనుమతి కూడా ఇచ్చేసింది. ఈ సంస్థ ట్యాబ్లెట్ కు మోల్నుపిరావిర్ గా పేరుపెట్టింది. ఒక్కొక్క టాబ్లెట్ ధరను 63 రూపాయలుగా నిర్ణయించారు. ఒక్క ప్యాకెట్ లో ఐదు స్ట్రిప్ లు ఉంటాయని, ఇందులో నలభై ట్యాబెట్లు ఉంటాయని సంస్థ ఎండీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ఈ టాబ్లెట్ ను రోజుకు రెండు డోసులు వినియోగించాలని, కోవిడ్ నుంచి కోలుకుంటారని చెబుతున్నారు.
Next Story