Fri Dec 05 2025 11:55:38 GMT+0000 (Coordinated Universal Time)
పంజాబ్ లో లడ్డూలు దొరకడం లేదట
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనుంది. మరి కొద్ది గంటల్లోనే పంజాబ్ ఎవరికి దక్కుతుందన్నది తేలిపోతుంది

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనుంది. మరి కొద్ది గంటల్లోనే పంజాబ్ ఎవరికి దక్కుతుందన్నది తేలిపోతుంది. ఎగ్జిట్ పోల్స్ లో అన్ని సంస్థలూ దాదాపు ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందని అంచనాల్లో చెప్పాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ముందస్తుగానే విజయోత్సవాలు చేసుకుంటున్నారు.
ఆర్డర్లు లెక్కకు మిక్కిలిగా.....
అయితే అన్ని రాజకీయ పార్టీల నేతలు భారీగా లడ్డూలకు ఆర్డర్ ఇచ్చారు. మిఠాయి దుకాణాలు లడ్డూల తయారీలో మునిగిపోయి ఉన్నాయి. రేపటికి అధిక సంఖ్యలో ఆర్డర్లు రావడంతో వాటి తయారీకి అదనపు సిబ్బందిని నియమించుకుని మరీ తయారు చేయిస్తున్నారు. గెలిచిన వెంటనే లడ్డూలు తినిపించుకోవడం ఆనవాయితీగా వస్తుండటంతో మిఠాయిలకు పంజాబ్ లో గిరాకీ బాగా పెరిగింది.
Next Story

