Fri Dec 05 2025 11:55:24 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీలో ఆధిక్యంలో బీజేపీదే
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు కౌంటింగ్ ప్రారంభం ప్రారంభమయింది. బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది.

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు కౌంటింగ్ ప్రారంభం ప్రారంభమయింది. బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. బీజేపీ పోస్టల్ బ్యాలట్ లో పదహారు స్థానాల్లో ముందంజలో ఉండగా, పథ్నాలుగు స్థానాల్లో ఆమ్ ఆద్మీపార్టీ అభ్యర్థులు ఉన్నారు. కేవలం ఒకస్థానంలో మాత్రమే కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుంది.
మ్యాజిక్ ఫిగర్...
మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఢిల్లీలో ఉండగా మేజిక్ ఫిగర్ 36 గా ఉంది. పోస్టల్ బ్యాలెట్ లలో బీజుపీ స్వల్ప ఆధిక్యతతో కొనసాగుతుంది. 8.30 గంటలకు ఈవీఎం లెక్కింపు ప్రారంభమవుతుంది. అప్పటి వరకూ పోస్టల్ బ్యాలట్ మాత్రమే కావడంతో ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకోవడానికి వీలులేదని విశ్లేషకులు చెబుతన్నారు.
Next Story

