Sat May 18 2024 17:16:17 GMT+0000 (Coordinated Universal Time)
సుప్రీంకోర్టులో కరోనా కలకలం
సుప్రీకోర్టులో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుంది. పలువురు లాయర్లు, న్యాయమూర్తులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.
సుప్రీకోర్టులో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తుంది. పలువురు లాయర్లు, న్యాయమూర్తులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. కొంత మంది న్యాయవాదులు అస్వస్థతకు గురి కావడంతో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో న్యాయమూర్తులకు కూడా కరోనా సోకినట్లు నిర్థారణ అయింది.
నేటి నుంచి ఆంక్షలు...
దీంతో సుప్రీంకోర్టులో కరోనా ఆంక్షలను అమలు చేస్తున్నారు. అందరూ మాస్క్లు విధిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కరోనా సోకిన న్యాయవాదులు, న్యాయమూర్తులు ఇంటి వద్దనే ఉండి చికిత్స పొందుతున్నారని తెలిపారు.
Next Story