Tue Apr 23 2024 14:04:09 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా దేశంలో 8,813 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 29 మంది మరణించారు
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత కొద్దిరోజులుగా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పదివేల కేసుల దాటి నెల గడిచిపోయింది. రోజుకు ఇరవై వేల కరోనా కేసులు నమోదవుతూ వచ్చాయి. అయితే తాజాగా దేశంలో 8,813 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 29 మంది మరణించారు. మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. ఒక్కరోజులోనే 15,040 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 98.56 శాతానికి చేరుకుంది.
తగ్గిన మరణాలు...
ఇక యాక్టివ్ కేసుల శాతం కూడా గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 0.25 శాతానికి నమోదయినట్లు కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 4,42,77,194 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 4,36,38,844 కోలుకున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా 5,27,098 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,11,252 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివవరకూ 2.08 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసిట్లు అధికారులు తెలిపారు.
Next Story