Mon Dec 08 2025 13:36:57 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు ఈరోజు కొంత తగ్గుముఖం పట్టాయి. ఒక్కరోజులో 6,809 కరోనా కేసులు నమోదయ్యాయి.

భారత్ లో కరోనా కేసులు ఈరోజు కొంత తగ్గుముఖం పట్టాయి. ఒక్కరోజులో 6,809 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 26 మంది మరణించారు. ఒక్కరోజులోనే 8,414 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 98.69 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 0.12 శాతానికి తగ్గినట్లు అధికారులు వెల్లడించారు.
యాక్టివ్ కేసులు....
గత కొద్ది రోజులుగా పది వేలకు లోపే కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 4,44,56,535 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 4,38,65,016 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో ఇప్పటి వరకూ కరోనాతో 5,27,965 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 55,114 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
Next Story

