Mon Dec 08 2025 18:38:10 GMT+0000 (Coordinated Universal Time)
భారీగా పెరిగిన కరోనా కేసులు
భారత్ లో భారీగా కరోనా కేసులు పెరిగాయి. గత రెండు రోజులుగా తగ్గిన కరోనా కేసులు మళ్లీ పెరిగాయి.

భారత్ లో భారీగా కరోనా కేసులు పెరిగాయి. గత రెండు రోజులుగా తగ్గిన కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజులోనే 17,135 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 47 మంది మరణించారు. మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా లేకపోవడంతోనే వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుందని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. నిన్న ఒక్కరోజులో 19,823 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
అప్రమత్తంగా లేకపోతే...
ప్రస్తుతం భారత్ లో ఇప్పటి వరకూ 4,40,67,144 కరోనా కేసులు నమోదయ్యాయి. వారిలో 4,34,03,610 చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 5,26,477 మంది మరణించారు. అయితే యాక్టివ్ కేసులు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం భారత్ లో 1,37,057 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Next Story

