Thu Jan 29 2026 19:53:30 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజూ తగ్గని కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రతి రోజూ ఐదువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రతి రోజూ ఐదువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇది డేంజర్ సైరన్ మోగినట్లేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. గడిచిన 24 గంటల్లో 5,353 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
కోవిడ్ నిబంధనలను...
కోవిడ్ నిబంధనలను పాటించాలంటూ ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. పెరుగుతున్న కేసులో ఒమిక్రాన్ XBBI 16 కారణం అని చెబుతున్నారు. ఢిల్లీలో నమోదవుతున్న కేసుల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ప్రజలు కూడా కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరుతున్నారు.
Next Story

