Sat May 18 2024 10:15:41 GMT+0000 (Coordinated Universal Time)
దుమ్మురేపుతున్న థర్డ్ వేవ్... మూడు రాష్ట్రాల్లో లాక్ డౌన్ తప్పదా?
దేశంలో కరోనా థర్డ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. రోజుకు రెండున్నర లక్షలకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి.
దేశంలో కరోనా థర్డ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. రోజుకు రెండున్నర లక్షలకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. కరోనాతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఎన్ని చర్యలు తీసుకున్నా, ఆంక్షలు విధించినా కేసుల సంఖ్య మాత్రం ఆగడం లేదు. ప్రధానంగా ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, కేరళలో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.
ఒక్కరోజులోనే.....
ఢిల్లీలో ఒక్కరోజులోనే 20,718 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 30.61 శాతం ఉంది. ఢిల్లీలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 93,470 ఉన్నాయి. ఇక కర్ణాటకలో ఒక్క రోజులోనే 32,793 కేసులు నమోదయ్యాయి. ఇందులో బెంగళూరులోనే 22,284 కేసులున్నాయి. ముంబయిలో పదివేల కేసులు, ఉత్తర్ ప్రదేశ్ లో 15,795 కేసులు నమోదయ్యాయి. అయితే వైద్య నిపుణుల లెక్కల ప్రకారం ఇరవై వేలు దాటితే లాక్ డౌన్ విధించాల్సి ఉంటుంది. దీనిని బట్టి ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో లాక్ డౌన్ విధించే అవకాశాలున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే కేసుల సంఖ్య ఎక్కువగా కన్పిస్తుంది.
Next Story