Sat Jan 31 2026 13:56:44 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో స్వల్పంగా తగ్గిన కరోనా
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 8,318 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 8,318 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 465 మంది మరణించారు. ఇప్పటి వరూ దేశంలో కరోనా బారిన పడి 3,39,88,797 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,07,019 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
మరణాలు...
భారత్ లో ఇప్పటి వరకూ 3,45,63,749 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,67,933 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,21,38,44,741 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
Next Story

