Fri Dec 05 2025 13:29:43 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో లక్షన్నర దాటిన కరోనా కేసులు
భారత్ లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది. కొత్తగా 1.59.632 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

భారత్ లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈరోజు కొత్తగా 1.59.632 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 327 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,52,22, 882 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
పెరుగుతున్న యాక్టివ్ కేసులు....
ప్రస్తుతం దేశంలో 5.90.611 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 3,59,18,358 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,83,602 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,51,58,76,774 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
Next Story

