Sun Feb 01 2026 07:23:29 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్ .. భారత్ లో భారీగా తగ్గిన కేసులు
భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 1,096 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 81 మంది మరణించారు

ఇండియా : భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 1,096 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 81 మంది మరణించారు. మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 42,493,773 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
వ్యాక్సినేషన్...
యాక్టివ్ కేసులు బాగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో 13,013 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,30,28,131 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,21,345 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,84,66,86,260 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు.
Next Story

