Sun Feb 01 2026 17:09:48 GMT+0000 (Coordinated Universal Time)
కనిష్ట స్థాయికి భారత్ లో కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 11,499 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు 255 మంది మరణించారు.

భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 11,499 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు 255 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,22,70,482 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
పాజిటివిటీ రేటు....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 1,21,881 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,29,05,844 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,13, 481 మంది మరణించారు. పాజిటివిటీ రేటు 1.01 శాతంగా ఉంది. ఇప్పటి వరకూ దేశంలో 1,77,17,68,379 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు.
Next Story

