Sat Jan 31 2026 12:17:47 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 8,774 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 8,774 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 621 మంది మరణించారు. ఇప్పటి వరూ దేశంలో కరోనా బారిన పడి 3,39,98,278 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,05,691 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
మరణాలు...
భారత్ లో ఇప్పటి వరకూ 3,45,72,523 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,68,554 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,24,38,44,741 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
Next Story

