Sat Jan 31 2026 07:36:12 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో పెరుగుతున్న మరణాలు
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 8,503 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 624 మంది మరణించారు

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 8,503 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 624 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,41,89,137 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 94,943 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
వ్యాక్సినేషన్...
భారత్ లో ఇప్పటి వరకూ 3,46,74,744 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,74,735 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,31,18,87,257 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది. మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది.
Next Story

