Fri Dec 05 2025 19:07:36 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 7,774 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 306 మంది మరణించారు

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 7,774 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 306 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,41,22,795 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 92,281 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
కోలుకుంటున్న వారు...
భారత్ లో ఇప్పటి వరకూ 3,46,74,744 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,75,434 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,32,99,87,257 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
Next Story

